కేటీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి అఖిల ప్రియ | Akhila Priya Invites KTR For Marriage | Sakshi
Sakshi News home page

Aug 7 2018 5:51 PM | Updated on Aug 21 2018 11:49 AM

Akhila Priya Invites KTR For Marriage - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లను కలిశారు.

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లను కలిశారు. ఈనెల 29న జరగనున్న తన పెళ్లికి రావాలని వారిని స్వయంగా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్‌ నాయుడితో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో ఆమె వివాహం జరగనుంది. రాజకీయ, సినిమా ప్రముఖులను మంత్రి అఖిలప్రియ ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్‌ వచ్చారు. 

సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో వివాహ విందు ఇవ్వనున్నారు. అఖిలప్రియ, భార్గవ్‌ రామ్‌లకు మే 12న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement