సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా దూరమవుతున్న దళిత ఓట్లను మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నాలుగు సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని అమలు బాధ్యతను రాహుల్గాంధీ కోర్కమిటీ సభ్యుడు, ఏఐసీసీ ఎస్సీసెల్ విభాగం చైర్మన్ కొప్పుల రాజుకు అప్పగించింది. అందులో భాగంగా ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కొప్పుల రాజు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను వేర్వేరుగా కలిసి ఇదే అంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం గాంధీభవన్లో, ఆ తరువాత పీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ భేటీలో మాట్లాడారు. దూరమవుతున్న దళితుల విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు నాలుగు అంశాలతో రూపొందించిన ప్రణాళికను వివరించారు.
దళితులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్న నేతలు
కొప్పుల రాజు ముఖ్య అతిథిగా ఆదివారం గాంధీభవన్లో జరిగిన ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశంలో వివిధ జిల్లాల నాయకులు పార్టీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్లో దళితులంటే చిన్న చూపుందని నేతలు వాపోయారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు స్థానమే లేకుండా పోయిందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదని అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు కూడా ఎస్సీలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా రుణాలిచ్చే దిక్కులేదని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ైచైర్మన్ ఎ.లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. తాను కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలైనా ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం ఇవ్వలేదని చెప్పారు.
సబ్ప్లాన్ నిధుల్లో రూ. 300 కోట్లు కార్పొరేషన్కు కేటాయించినా రుణాల మంజూరు అధికారమంతా బ్యాంక్ చేతుల్లోనే పెట్టడం బాధాకరమన్నారు. బొత్స మాట్లాడుతూ.. ఎస్సీల విషయంలో ఎంతో అవకాశం ఉన్నా పెద్దగా కార్యక్రమాలు అమలు చేయలేకపోయామని, ఇలా జరగడం బాధాకరమన్నారు. అయినా ‘‘ఎన్నికలు రాబోతున్నందున మనల్ని మనమే సముదాయించుకుని పార్టీ కోసం ముందుకు వెళదాం’’ అని ఊరడించే ప్రయత్నం చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ నంది ఎల్లయ్య, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దళితుల ఓట్ల ఆకర్షణకు సూత్రాలివే..
ఙ్ట్చఛగ్రామ స్థాయిలో దళితుల సమస్యలపై పోరాడుతున్న యువకులను గుర్తించి కమిటీలుగా ఏర్పాటు చేస్తారు.
దళితులకు, ఇతర సామాజికవర్గాలకు మధ్య తేడాను, వారి ఆకాంక్షలను గుర్తించి వాటిని నెరవేర్చేందుకు దళిత నాయకులు ఏమేరకు విజయవంతమయ్యారనే దానిపై పర్యవేక్షణా కమిటీలను నియమిస్తారు. 3 నెలల్లో ఆ కమిటీలిచ్చే నివేదికల ఆధారంగా పంచాయతీ, మున్సిపల్, నగర ఎన్నికలతోపాటు శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో నేతలకు టికెట్లు ఇస్తారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తారు.
బ్లాక్, డీసీసీ, పీసీసీ మొదలు ఏఐసీసీ వరకు ప్రతి సమావేశంలోనూ దళితుల అభిప్రాయాలు విన్పించే ఎజెండాను చేర్చాలి. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాట పంథాను అనుసరించాలి.
యూపీఏ ప్రభుత్వానికి జాతీయ సలహా మండలి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇకపై ఓ సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతోపాటు వారి కోసం అమలవుతున్న కార్యక్రమాల సరళిని విశ్లేషించి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసేలా కృషి చేయడం వీటిలో ఉన్నాయి.
దళిత ఓట్ల గాలానికి 4 సూత్రాలు
Published Mon, Jan 6 2014 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement