డీసీఎం వ్యానులు ఢీ: నలుగురు మృతి | 4 killed, 4 injured in road accident at Anantapur district | Sakshi
Sakshi News home page

డీసీఎం వ్యానులు ఢీ: నలుగురు మృతి

Aug 15 2014 8:15 AM | Updated on Aug 30 2018 3:58 PM

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇవుడూరు సమీపంలో రెండు డీసీఎంలు శుక్రవారం ఢీ కొన్నాయి.

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇవుడూరు సమీపంలో రెండు డీసీఎంలు శుక్రవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తాడిపత్రిలోని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొట్టాలపల్లి నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ఆ ప్రమాదంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement