అనంతపురం తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident In Tadipatri Anantapur - Sakshi

సాక్షి,అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకట రంగయ్యగా గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top