100 కేజీల బంగారం స్వాధీనం... | 100 kg gold seized at Donabanda checkpost in krishna district | Sakshi
Sakshi News home page

100 కేజీల బంగారం స్వాధీనం...

Mar 27 2014 9:06 AM | Updated on Sep 2 2017 5:15 AM

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు.

ఎన్నికల  నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు. అందులోభాగంగా విజయవాడ  ఇబ్రహీంపట్నం సమీపంలోని దొనబండ చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం వాహనాలను సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఓ కారులో దాదాపు 100 కేజీలకు పైగా  బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని,సీజ్ చేశారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారంపై ప్రశ్నిస్తున్నారు. అయితే బంగారం పట్టుకున్న విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement