మేడ్చల్ జిల్లా: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మచ్చ»ొల్లారంలో నివసించే ఓ మహిళ (33) మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురితో కలిసి నివాసముంటోంది. స్థానికంగా ఉండే దుర్గాప్రసాద్ (34) తో సహజీవనం చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయలో దుర్గాప్రసాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.


