కివీస్ స్పిన్నర్ సాంట్నర్ వేసిన 23 ఓవర్లో తొలి నాలుగు బంతులు పరుగులేమి. దీంతో అసహనానికి గురైన పంత్ ఐదో బంతిని బౌండరీకి పంపించాలని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్రాండ్హోమ్ రెండు చేతులా క్యాచ్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. కీలక సమయంలో అనవసర షాట్ ఆడిన పంత్పై పాండ్యాతో సహా పెవిలియన్లో ఉన్న కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ అసహనం వ్యక్తం చేసింది. ఇక సోషల్మీడియా వేదికగా నెటిజన్లు పంత్ పేలవ షాట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంత్ నిర్లక్ష్యమైన షాట్.. నెటిజన్లు విమర్శలు
Jul 10 2019 6:11 PM | Updated on Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement