లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ | Two Woman Theft Neckles In Lalitha Jewellers By Duping Staff | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ

Dec 9 2017 6:32 PM | Updated on Mar 21 2024 6:14 PM

'డబ్బులు ఊరికే రావు' అనే మాటతో మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు పొందిన లలితా జ్యువెల్లర్స్‌లో శనివారం చోరీ జరిగింది. ఈ మేరకు జ్యువెల్లర్స్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు దోచుకెళ్లినట్లు జ్యువెల్లర్స్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు. రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ ప్రారంభించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement