చంద్రబాబుకు పేదలు కనిపించరు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడాబాబులకే అండగా ఉంటారని, ఆయనకు పేదలు కనిపించరని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారధి విమర్శించారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని గురువారం ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీలో ఉన్న వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని మండిపడ్డారు. నమ్మినవారికి అన్యాయం చేయటమే చంద్రబాబు పని అని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top