‘లక్ష్మీస్‌ ఎన్డీఆర్‌’ పై ఈసీకి ఫిర్యాదు

 ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాని నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి సినిమా విడుదల వాయిదా వేసేలా చొరవ చూపాలని కోరారు. సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top