శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తి | tearful-farewell-for-sobha-nagi-reddy | Sakshi
Sakshi News home page

Apr 25 2014 6:23 PM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్సార్ సీపీ నేత భూమా శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జిల్లాలోని ఆళ్లగడ్డలో ఆమె అంత్యక్రియల కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరైయ్యారు. బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి.. నిన్న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గురువారం ఆమె పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం నంద్యాలలో ఉంచారు. అనంతరం ఈ రోజు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఆమె అంతిమ యాత్ర ఆరంభమైంది. శోభమ్మ ఇక లేరని తెలిసి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి లోనైయ్యారు. ఆమె అంతిమ యాత్రకు అశేష జనవాహిని హాజరై ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా వెలుగొందిన శోభా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. శోభానాగిరెడ్డి మృతదేహానికి ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ చేరుకున్న జగన్... శోభానాగిరెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా శోభానాగిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. శోభానాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడిని జగన్ ఓదార్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శోభానాగిరెడ్డి పార్థీవదేహానికి అంజలి ఘటించారు. మరోవైపు శోభానాగిరెడ్డిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement