ఎస్బీఐ కీలక నిర్ణయం: సగం ఆఫీసుల మూత | SBI to shut down 47% of associate banks' offices post-merger | Sakshi
Sakshi News home page

Mar 21 2017 7:31 PM | Updated on Mar 21 2024 6:40 PM

ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా వెలుగొందేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చేపట్టే ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇక త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల సగం కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దీనిలోనే మూడు ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయట. ఏప్రిల్ 24 నుంచి ఈ మూసివేసే ప్రక్రియను ప్రారంభించబోతుంది. అనుబంధ బ్యాంకుల ఐదు ప్రధాన కార్యాలయాల్లో కేవలం రెండింటిని మాత్రమే ఉంచాలనుకుంటున్నామని, అనుంబంధ బ్యాంకులకు సంబంధించి 27 జోనల్ ఆఫీసులు, 81 రీజనల్ ఆఫీసులు, 11 నెట్ వర్క్ ఆఫీసులతో పాటు మూడు ప్రధాన కార్యాలయాలను మూసివేస్తామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖరా చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement