పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకంతకూ పెరుగుతూ తాజాగా రూ.60,431.19 కోట్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి తాజా అంచనాల మేరకు రూ.48,231.74 కోట్లు అవసరమంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది. ఈ ప్రతిపాదనలను కేంద్ర జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ, నీతి అయోగ్ ఆమోదిస్తే కేంద్రం నిధులను మంజూరు చేస్తుంది. 2013–14 నుంచి జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో–63 (పరిమాణాల ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేస్తే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.65 వేల కోట్లకు చేరుతుందని అధికారవర్గాలు పేర్కొనడం గమనార్హం.
Aug 1 2017 6:50 AM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement