బలపరీక్షలో నెగ్గిన పారికర్‌! | Sakshi
Sakshi News home page

బలపరీక్షలో నెగ్గిన పారికర్‌!

Published Thu, Mar 16 2017 12:33 PM

గోవాలో ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. గురువారం గోవా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంది. మనోహర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 21.

Advertisement
Advertisement