పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన తమ పార్టీ మద్దతుదారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారో తెలుసుకొని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే బాగుంటుందన్నారు. ఎన్నికైనవారు ఏ పార్టీకి చెందినవారో విచారించి ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తే తాము కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఎవరు ఏ విధంగా ప్రచారం చేసుకున్నా ప్రజల అభిమానం తమపైనే ఉందన్నారు.
Jul 18 2013 3:39 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement