‘‘ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి మిషన్ భగీరథ తొలి ఫలాలు అందబోతున్నాయి. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీళ్ల చొప్పున, మొదటి ఫేజ్ కింద 10 నియోజకవర్గాల ప్రజలకు ఇంటింటికీ నల్లా పెట్టి గోదావరి నీళ్లు సరఫరా చేస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు.