ల్యాండ్ పూలింగ్కు రైతుల షాక్ | ap-farmers-turn-back-from-land-pooling | Sakshi
Sakshi News home page

Mar 7 2015 3:39 PM | Updated on Mar 22 2024 11:06 AM

రాజధాని ప్రాంత రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చారు. ల్యాండ్ పూలింగ్కు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మంగళగిరి మండలం నవులూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట బేతపూడి రైతులు ఆందోళన ప్రారంభించారు. తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ డిప్యూటీ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. గతంలో తామిచ్చిన అంగీకార పత్రాలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement