తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ నెట్వర్కింగ్పై హ్యాకర్స్ మరోసారి పంజా విసిరారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని 25 శాతం పోలీస్ స్టేషన్లలో నెట్వర్క్ పనిచేయడం లేదు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో నిన్న సాయంత్రం నుంచి కంప్యూటర్లు పని చేయడం లేదు.