రఘుపై చర్యలు వద్దు | ACB seizes Raghu's original documents | Sakshi
Sakshi News home page

రఘుపై చర్యలు వద్దు

Oct 10 2017 7:01 AM | Updated on Mar 22 2024 11:17 AM

రాష్ట్రంలో అవినీతిపరులైన అధికారులకు ప్రభుత్వమే దన్నుగా ఉంటే అడ్డేముంది. అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టుబడ్డ గోళ్ల వెంకట రఘు విషయంలో చంద్రబాబు సర్కారు తీరు ఇలానే ఉంది. ఆయనపై గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసిన విజిలెన్స్‌ విచారణ నివేదికపై చర్యలు నిలుపుదల చేస్తూ చంద్రబాబు సర్కారు గత నెల 21న ఏకంగా ప్రత్యేకంగా జీవోనే జారీ చేసింది. తద్వారా రఘుపై చర్యలు తీసుకోకుండా మోకాలడ్డింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత చక్రం తిప్పారని సమాచారం. అయితే ఏసీబీ ఆకస్మికంగా రఘుపై దాడులు చేయడంతో ఆయన అవినీతి వెలుగుచూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement