ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

పీలేరురూరల్‌ : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీఎస్‌ఆర్‌ కల్యాణమండపంలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు టెట్‌ నిబంధన విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంటే, పరిష్కార చర్యలు చేపట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ఉండడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్‌ ఉమ్మడి సర్వీసు రూల్స్‌ విషయంలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ, ఐఆర్‌పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్‌. సాయిశ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షులు ఎ. శివారెడ్డి, ఎస్టీయూ నాయకులు కె.వి. శేఖర్‌, గాజుల నాగేశ్వరరావు, పి. రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, పోకల మధుసూదన, జగన్‌మోహన్‌రెడ్డి, కడియాల మురళి, మోహన్‌, వేణుగోపాల్‌రెడ్డి, గంటా మోహన్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement