కడప కార్పొరేషన్: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాయలసీమ జిల్లాల నేతలతో ఆ పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి సమావేశమయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్న్ ప్రాజెక్ట్పై భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పి.రవీంద్రనాథ్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డిలతో పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాల నేతలు హాజరయ్యారు.


