ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజయం

Jul 7 2025 6:30 AM | Updated on Jul 7 2025 6:30 AM

ఏసీఏ

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజ

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో ఆదివారం మూడవ రోజు కర్నూలు జట్టుపై అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది. కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెండవ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 51.1 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్‌ నాయుడు 87 పరుగులు, మహిత్‌ 37 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్‌ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్‌లో రాణించి 5 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్‌ నాయుడు 3 వికెట్లు తీశారు. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 486 పరుగులు చేయగా కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 214 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ స్టేడియంలో..

అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆదివారం 63 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 87 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని మన్విత్‌ రెడ్డి 97 పరుగులు, ఎస్‌ఎస్‌ హమీద్‌ 67, కారుణ్య ప్రసాద్‌ 52 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్‌ 3 వికెట్లు, తేజేష్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 48 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

డ్రాగా ముగిసిన

నెల్లూరు–చిత్తూరు మ్యాచ్‌

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజ1
1/2

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజ

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజ2
2/2

ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో అనంతపురం జట్టు ఘన విజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement