ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన

Jul 7 2025 6:30 AM | Updated on Jul 7 2025 6:30 AM

ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన

ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ సర్వీసు మొరాయించడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఆదివారం మధ్యాహ్నం కడప బస్టాండులో జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ బస్సు మొరాయించింది. ఈ క్రమంలో బస్టాండుకు చేరుకున్న ప్రయాణికులు ఎంతసేపటికీ బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్టాండులోని కంట్రోలర్‌తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బస్సుకు మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆర్టీసీ అధికారులు చేసేది లేక సాయంత్రం 6 గంటలకు ఇంద్ర సర్వీసును బెంగళూరుకు పంపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను సకాలంలో పంపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బస్సు సకాలంలో రాకపోవడంతో వివిధ సమస్యలు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.

మూడు గంటలు ఆలస్యంగా

బెంగళూరు సర్వీసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement