కొండ గుల్ల! | - | Sakshi
Sakshi News home page

కొండ గుల్ల!

May 29 2025 12:11 AM | Updated on May 29 2025 12:11 AM

కొండ

కొండ గుల్ల!

‘తమ్ముళ్ల’ దెబ్బ..

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

ప్రకృతి సంపదను గుళ్ల చేస్తున్న పచ్చ నేతలు

కొండలు, గుట్టలు, చెరువులు, నదులు లూఠీ

పైసా ఖజానాకు చేరకుండా జేబుల్లోకి ప్రజాధనం

సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్‌లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల అక్రమాదాయకోరల్లో చిక్కి నదులు శల్యమవుతున్నాయి. ఉచిత ఇసుక మాటున లూఠీ చేస్తున్నారు. చిత్రావతి, పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదులను చెరబట్టారు. పేరుకే ప్రభుత్వ రీచ్‌లు, పక్కనున్న గ్రామాల నుంచి యధేచ్ఛగా మిషన్లు పెట్టి లోడింగ్‌ చేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. ప్రజాధనం పైసా కూడా ఖజానాకు చేరకుండా పక్కదారి పట్టింది. అధికారమే పెట్టుబడిగా తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా అన్నట్లుగా అక్రమ ఆదాయం ఉండిపోయింది.

● ప్రకృతి సంపద అధికార పార్టీ నేతల పాలిట కల్పతరువుగా మారింది. ముఖ్యంగా ‘ఉచిత ఇసుక’ దోపిడీ పథకంగా తెరకెక్కింది. ప్రభు త్వ రీచ్‌లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, సంబటూరు ఇసుక రీచ్‌లు నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచ్‌ నిర్వహణను దక్కించుకున్న తెలుగుతమ్ముళ్లు ఆ మాటునా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాలల్లో ఈతంతు అత్యధికంగా చోటుచేసుకుంటోంది.

కడపలో గ్రావెల్‌ దందా...

కడప పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తీవ్రమైంది. అధికారికంగా ఉన్న గ్రావెల్‌ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వకపోగా, అనధికార గ్రావెల్‌ మైన్స్‌ టీడీపీ నేతల నేతృత్వంలో నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది రూపాయాలు గ్రావెల్‌ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు తప్పితే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. అధికారం అడ్డుపెట్టుకొని ప్రజాధనం లూఠీ అవుతోంది. సంక్రాంతి పండుగ సందట్లో ఏకంగా నిల్వ ఉంచిన బరైటీస్‌ లూఠీ చేశారు. టిఫెన్‌ బరైటీస్‌ కంపెనీకి చెందిన సుమారు 3వేల టన్నుల బరైటీస్‌ ఖనిజాన్ని వేముల కేంద్రంగా అక్రమంగా తరలించుకుపోయారు. ఇవన్నీ తెలుగుతమ్ముళ్ల కనుసన్నుల్లోనే చోటు చేసుకున్నాయి. శాంతి విధ్వంసం–పునః నిర్మాణం అంటూ మహానాడులో సమీక్షలు చేసిన చంద్రబాబు సర్కార్‌లోనే ఇవన్నీ చోటుచేసుకున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

అన్యాక్రాంతమవుతున్న విలువైన భూములు

బి.కోడూరు మండలం పాయలకుంట్ల పంచా యతీ పరిధిలోని వేమకుంట రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 18లో 16.75 ఎకరాల ప్రభు త్వ భూమి ఉంది. ఈ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. అంతే రాత్రికి రాత్రే బోరు వేశా రు. అందుకు అవసరమైన విద్యుత్‌ కోసం స్థంభాలు వెలిశాయి. ప్రొక్లెయిన్‌తో భూమి చదును చేశారు. పార్టీ ఇన్‌చార్జీ నేత కనుసన్నల్లో రేయింబవళ్లు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ భూమి చదును చేస్తున్న వ్యవహారం పత్రికల్లో వెలుగుచూసినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

● మైదుకూరు మండలం నంద్యాలంపేటలో సర్వేనంబర్‌ 859లో 16 ఎకరాలు, సర్వేనంబర్‌ 840లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమికి ఏకంగా కంచె వేశారు. తిప్పిరెడ్డిపల్లె గోడేరు చెరువులో 50ఎకరాలు అన్యాక్రాంతమైంది. వల్లూరమ్మ చెరువు పేరుకు మాత్రమే ఉండిపోయింది. 30 ఎకరాలల్లో ఉన్న చెరువు 2 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. సర్వే నంబర్‌ 77లో 4ఎకరాలు కొండ పరంబోకును చదను చేశారు. 138/సీలో కుంట పరంబోకు 12 ఎకరాలు సబ్‌డివిజన్‌ చేయించుకొని పాసుబుక్‌లు కూడా తెచ్చుకున్నారు.

కొండ గుల్ల! 1
1/2

కొండ గుల్ల!

కొండ గుల్ల! 2
2/2

కొండ గుల్ల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement