– జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్
కడప అర్బన్ : కడప నగరంలోని పురుషుల కేంద్రకారాగారం, ప్రత్యేక మహిళా కారాగారంలతో పాటు రాయచోటిలోని సబ్ జైలును వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ తమ సిబ్బందితో శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను పరిశీలించడంతో పాటు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయమును సద్వినియోగం చేసుకోవాన్నారు. మానసిక వ్యాధిగ్రస్తులైన ఖైదీలతో మాట్లాడారు.
సకాలంలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ మందులు వాడాలన్నారు. ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ప్రిజం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం కల్పించారు. కార్యక్రమంలో పురుషుల కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, ప్రత్యేక మహిళ కారాగారం సూపరింటెండెంట్, రాయచోటి సబ్ జైల్ సూపరింటెండెంట్, పానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు మరియు ఖైదీలు పాల్గొన్నారు.

ఖైదీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి