
వైఎస్సార్సీపీ నేతపై దాడి
పుల్లంపేట : పుల్లంపేట మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీసీపీ నాయకుడు, అనంతంపల్లి సహకార బ్యాంక్ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంటు సుదర్శన్రెడ్డిపై శనివారం రాత్రి పుల్లంపేట పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్లంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, కుమార్రెడ్డి, పుల్లంపేట సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి నాయకులు దాడి చేయడం పరిపాటిగా మారింది. ప్రశాంతంగా ఉన్న పుల్లంపేట మండలంలో కూటమి నాయకులు దాడి చేయడంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్ఐ తెలిపారు.