
● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా గడిచిన ఐదేళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు పని చేసింది. కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి.. సరిగ్గా ఆ తేదికి అమలు చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 9,82,554 మందికి రూ.8,857.42 కోట్లు వేశారు. సామాన్య కుటుంబాలకు కామధేనువులా వైఎస్ జగన్ సర్కార్ కాపాడింది. ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశ పెట్టిన టీడీపీ ప్రజల్ని మభ్యపెట్టింది. చంద్రబాబు సర్కార్ కూడా ఆ పథకాలు ద్వారా చెల్లింపులు చేస్తారని భావించి మోసపోయారని విశ్లేషకులు వివరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఊదరగొట్టారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యా రెంటీ’ అన్నారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నమ్మించారు. అధికారం కోసం ముఖానికి అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మరోమారు సీఎం చంద్రబాబు చేతిలో దగాకు గురయ్యారు. ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. నాటి మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. తల్లికి వందనమంటూ చెప్పి.. శఠగోపం పెట్టారు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లనలా ఉండిపోయింది. కర్షకుల కన్నీరు తుడుస్తానంటూ పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామన్న మాట ఊసేలేదు. వెరసి నమ్మి మోసపోయామంటూ మహిళాలోకం ఆక్రోశం చెందుతోంది.
ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ..
‘ప్రతి ఇంటికి ఉద్యోగం.. లేదంటే, నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ అని ఎన్నికల హామీల్లో ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఏడాదైంది, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి ఇప్పటికీ ప్రభుత్వం రూ.36 వేలు బకాయి ఉన్నట్లే. దారిద్య్రరేఖకు దిగువనున్న వారు జిల్లా వ్యాప్తంగా 5,82,633 కుటుంబాలు ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువకులంతా నిరుద్యోగ భృతికి అర్హులే. అలాగే అమ్మఒడి పథ కం ద్వారా నాలుగేళ్లలో వైఎస్ జగన్ సర్కారు రూ. 1,337.4 కోట్లు చెల్లించారు. కాగా, ఆ స్థానంలో తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ వర్తింపజేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీగా ప్రకటించారు. ఏడాదిగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు శఠగోపం పెట్టారు.
ఊరిస్తున్న ఉచిత బస్సు
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళాలోకం ఇకపై ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును’ అని హామీ ఇచ్చారు. ఇదిగో అదిగో సంక్రాంతి, ఉగాదికి అమలు చేస్తామని ఊరిస్తూ వచ్చారు. జిల్లాలో ప్రజారవాణాలో ఉన్న 590 బస్సుల ద్వారా ప్రతి రోజు 1.29 లక్షల మంది సరాసరిగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలు ప్రతి రోజు ప్రయాణిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే 38,700 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఏడాదైనా వారికి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం దక్కలేదు. మరోవైపు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం రూ.5 వేల స్థానంలో రూ.10 వేలు చేస్తామని ప్రకటించారు. ఆపై ఉన్న ఉపాధి కూడా లేకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,890 మంది సచివాలయ వ్యవస్థ పరిధిలో ఉన్న వలంటీర్లు నిరుద్యోగులయ్యారు. అలాగే మరో 366 మంది రేషన్బండ్ల ఆపరేటర్లు నిరాశ్రయులయ్యారు.
విద్యుత్ బిల్లులు బాదుడే.. బాదుడు
అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచబోమని, తగ్గిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా, అసలు కంటే కొసరు అధికంగా ఉండేలా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ వాడకం కంటే డబుల్ బిల్లు వినియోగదారులకు వస్తోంది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జెస్ట్మెంట్(ఎఫ్పీపీసీఏ) కింద జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం కోట్లలో భారం మోపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతి నెలా వడ్డనకు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కాలంలో సర్దుబాటు చార్జీలకు తోడుగా అక్టో బర్ నెల నుంచి ఏ నెలకు ఆనెల సర్దుబాటు పేరుతో యూనిట్కు 91 పైసల చొప్పున భారం వేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సుమారు రూ.15 కోట్లను వసూలు చేయనున్నట్లు విద్యుత్ అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. అసలు కంటే కొసరు రూపంలో ముక్కుపిండి రాబట్టుతున్నారు. సామాన్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
నిరుద్యోగులకు మళ్లీ మోసం
నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 2014–19లో కూడా ఇలాగే చెప్పి ఎన్నికల ముందు రెండు నెలలు ఇచ్చారు.
–భూమిరెడ్డి భాస్కర్, బీఎస్సీ, బీఈడీ, నిరుద్యోగి,
లింగాలదిన్నెపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం
అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూపులు
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ద్వారా మూడు విడతల్లో పంట సాగు సమయానికి డబ్బులు అందేవి.
–సీవీ సుబ్బారెడ్డి, రైతు,
పడమర అనంతపురం, చాపాడు మండలం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంటే.. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు ఎన్నికల హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రైతు భరోసా పేరిట ఐదేళ్లలో రూ.1,191.03 కోట్లు నేరుగా అందించారు. కర్షకులకు అండగా నిలవాలన్న ఆలోచన చంద్రబాబు సర్కారు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2,10,481 మంది రైతులు సుఖీభవ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా రూ.420.96 కోట్లు రైతులకు అందించాల్సి ఉంది. పీఎం కిసాన్ సాయం నిధుల ద్వారా ఇప్పటికీ కేవలం రూ.2 వేల చొప్పున మాత్రమే రైతులకు నేరుగా లభించింది. అంటే కేవలం రూ.42.09 కోట్లు మాత్రమే వర్తించింది. దాదాపు రూ.380 కోట్లు ఇంకా లభించాల్సి ఉంది. ఆ దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేయడం లేదని కర్షకులు మండిపడుతున్నారు. పథకాల పేర్లు ఘనంగా పెట్టారు, కానీ అమలులో చిత్తశుద్ధి లేదని పలువురు వాపోతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కూడా అదే పరిస్థితి. 18 ఏళ్లు నిండిన యువతి నుంచి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరువాడ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.18 వేలు బకాయి ఉన్నట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని మునుపటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు భావిస్తే, చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా పాలిస్తూ ఏకంగా మహిళలోకాన్ని వంచిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
కడపలో బక్రీద్ సందేశం ఇస్తున్న ముఫ్తీ న్యామతుల్లా సాహెబ్, భక్తులతో కలిసి నమాజ్ చేస్తున్న పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్
వైఎస్ జగన్ సర్కార్లో..
న్యూస్రీల్
అటకెక్కిన 50 ఏళ్లకే పెన్షన్ వాగ్దానం
అందని ద్రాక్షలా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి
విద్యుత్ చార్జీలు పెంచమంటూనే బాదుడే బాదుడు
వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మోసం
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.15 వందలు ఉత్తిదే
రైతుకు పెట్టుబడి సాయం ఊసేలేదు
‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు
అమలు కాని సూపర్ సిక్స్ పథకాలు
చంద్రబాబు ఏడాది పాలనపైమండిపడుతున్న ప్రజలు, విపక్షాలు

● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..

● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..

● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..

● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..