
యోగాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్ : ఈనెల 21 నుంచి జూన్ 21 వరక్ఙుయోగాంధ్ర– 2025్ఙ మాసోత్సవాల్లో నిర్వహించే అన్ని కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు శ్రీయోగాంధ్ర– 2025్ఙపై నిర్వహించే వివిధ కార్యక్రమాలు, పీఎం–సూర్యఘర్ పథకం, ఎన్టీఆర్ వైద్యసేవలు, స్వచ్ఛఆంధ్ర, హరితాంధ్ర, హౌసింగ్ తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు జేసీ అదితిసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ 11వ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని దీనికి రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది హాజరయ్యే లక్ష్యంతో అధికారులు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రతి ఆదివారం ఉదయం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థాగత, పబ్లిక్ ప్రదేశాల్లో జిల్లాలో యోగా క్యాంపెయిన్ లను నిర్వహించాలన్నారు. యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జూన్ 10వ తేదీ వరకు ఆశక్తి కలిగిన ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది మీ ఇంటివద్దకే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, సీపీవో హాజరతయ్య, డిపివో రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు రాజ్యాలక్ష్మీ, అదిశేషారెడ్డి, కిరణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.