జూన్‌ 9న పీజీ సెట్‌ వాయిదా వేయాలి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 9న పీజీ సెట్‌ వాయిదా వేయాలి

Jun 2 2025 1:09 AM | Updated on Jun 2 2025 1:09 AM

జూన్‌ 9న పీజీ సెట్‌   వాయిదా వేయాలి

జూన్‌ 9న పీజీ సెట్‌ వాయిదా వేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : డీఎస్సీలో పీఈటీ, పీజీ సెట్‌లో ఎంపీఈడీ రెండు పరీక్షలు జూన్‌ 9న జరుగుతున్న కారణంగా పీజీ సెట్‌ను వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోతారన్నారు. పీజీ సెట్‌ పరీక్షను జూలై నెలలో నిర్వహించాలని కోరారు.

సూపర్‌ సిక్స్‌అమలు

చేయకపోతే పోరాటం

జమ్మలమడుగు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండల పరిధిలోని నాయకులతో ఈనెల 4న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతినెల రూ.1500 వారి ఖాతాలలో జమ చేసేవిధంగా ఆడబిడ్డ పథకం, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతులకు 20వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకు వాటిని అమలు చేయలేదన్నారు. సూపర్‌ సిక్స్‌పై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మహానాడులో కూడా సూపర్‌ సిక్స్‌పై స్పష్టత ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కృష్ణా జలాలు వచ్చేందుకు ప్రధానం కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమే అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్‌, రైతుల సంక్షేమం పూర్తిగా విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిధర్‌రెడ్డి, శివగురివిరెడ్డి, మోహన్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, రామాంజనేయులు యాదవ్‌, కొట్టాలపల్లి నారాయణరెడ్డి, రమణారెడ్డి, సుధీర్‌, విశ్వనాథ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement