
●అడ్డంగా బుక్కయ్యారు
టీడీపీ నాయకులు ఇష్టారీతిన కరెంటును అక్రమంగా వాడుకునేందుకు సాగిలపడి సహకరించిన విద్యుత్ అధికారులు...తాము చేసిన తప్పు మూడో కంటికి తెలియకూడదని అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 29వ తేదీ సాయంత్రానికి మహానాడు పూర్తికాగా, ఆగమేఘాలపై కదిలి యంత్రాంగాన్నంతా వినియోగించి 30వ తేదీ మధ్యాహ్నానికల్లా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, కాంక్రీట్ దిమ్మెలు వంటిి ఏ చిన్న ఆనవాళ్లు కూడా దొరక్కుండా పక్కాగా పథక రచన చేశారు. అయితే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...సాక్షికి అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను క్రేన్లతో తొలగించడం, విద్యుత్ సామాగ్రిని ట్రాక్టర్లలో తరలించడం వంటి దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి.