
ఎల్ఎల్బీ సెమిస్టర్ల ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎల్ఎల్బీ (3,5 సంవత్సరాల), 3 5, 7, 9 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు, అకడమిక్ డీన్ ఆచార్య చంద్ర ఓబులరెడ్డి శుక్రవారం పరిపాలన భవనంలో విడుదల చేశారు. ఐదేళ్ల ఎల్ఎల్బీ మూడో సెమిస్టర్ 81 శాతం, ఐదో సెమిస్టర్ 76, ఏడో సెమిస్టర్ 61, తొమ్మిదో సెమిస్టర్లో 91.67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సు 3వ సెమిస్టర్ లో 23.81 శాతం, 5వ సెమిస్టర్లో 88.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేసిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగాన్ని రిజిస్ట్రార్ అభినందించారు.
శాంతియుతంగా
బక్రీద్ను జరుపుకోండి
కడప అర్బన్: మత సామరస్యానికి ప్రతీకై న వైఎస్సార్ కడప జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, సుఖశాంతులతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ సూచించారు. సమైక్యత, సమానత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పండుగ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తినట్లు తెలిపారు. పోలీస్ పికెట్లు, చెక్పోస్ట్లను ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ పార్టీలు, స్పెషల్ పార్టీ, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుకార్లు, సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఫిర్యాదు కానీ, ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని వివరించారు.

ఎల్ఎల్బీ సెమిస్టర్ల ఫలితాల విడుదల