కడప కోటిరెడ్డిసర్కిల్: పెరిగిన ఉష్ణోగ్రతల నేపధ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఉప కార్మిక కమిషనర్ శ్రీకాంత్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తమవంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికుల పని వేళల్లో మార్పు చేయాలని, పని ప్రాంతంలో చల్లని నీరు, నీడ వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిచే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశంలో కార్మికులు పనిచేయకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
కుట్టుమిషన్ శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ప్రొద్దుటూరు: బీసీ కార్పొరేషన్, కాపు, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22లోపు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న లబ్ధిదారులకు శిక్షణ అనంతరం 75 శాతంపైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికెట్, ఉచితంగా కుట్టుమిషన్ అందిస్తారని వివరించారు. 18–50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులని, తెల్ల రేషన్కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు ఉండాలని, కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులని తెలిపారు.
మద్యం ప్రీమియం స్టోర్కు...
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రీమియం స్టోర్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రీమి యం స్టోర్ లైసెన్స్ వ్యవధి 5 ఏళ్లని, లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ. కోటి ఉంటుదని రెండవ సంవత్సరం నుంచి ఉన్న ఫీజు 10 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ప్రీమియం స్టోర్ కార్పెట్ వైశాల్యం 4 వేల చదరపు అడుగులు ఉండాలని తెలిపారు. ప్రీమియం స్టోర్ దరఖాస్తు కోసం రుసుము రూ. 15 లక్షలు డీడీ ద్వారా తీసుకురావాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈ నెల 26 సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఆర్టీపీపీలో పెరిగిన
బొగ్గు నిల్వలు
ఎర్రగుంట్ల: డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో 1.38లక్షలు మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని ఆర్టీపీపీ సీఈ గౌరీపతి మంగళవారం తెలిపారు. ఆర్టీపీపీలోని 1,2,3,4,5,6 యూనిట్లలో గాను 1650 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి గాను ప్రస్తుతం 1420 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. అన్ని యూనిట్లులో విద్యుత్ ఉత్పత్తికి గాను సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం అవుతోందని పేర్కొన్నారు.
పైడిపాళెం ఆయకట్టుకు
కృష్ణా జలాలు
కొండాపురం: గండికోట జలాశయంలో నుంచి గండికోట ఎత్తిపోతలపథకం వద్ద ముడు మోటర్ల ద్వారా 300 క్యూసెక్కులనీటిని పంపింగ్ చేస్తున్నట్లు జీకేఎల్ఐ ఈఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడిపాళెం జలాశయ ఆయకట్టు రైతులకు సాగు,తాగునీరు అవసరాల కోసం గండికోట ఎత్తిపోతల పథకం నుంచి గండికోట డ్యామ్ లో నిల్వ ఉన్న కృష్ణ జలాలను పంపింగ్ చేస్తున్నామన్నారు. పైడిపాళెం జలాశయం పూర్తి సామర్థ్యం 6 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో4.2 టిఎంసీలు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం గండికోట లో 23.5టిఎంసీలు ఉన్నట్లు గాలేరినగరి సృజలస్రవంతి ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు.
కార్మికులు అప్రమత్తంగా ఉండాలి