నితీష్‌ కుటుంబంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

నితీష్‌ కుటుంబంలో విషాదం

Aug 13 2024 1:28 AM | Updated on Aug 13 2024 10:04 AM

-

ప్రొద్దుటూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నితీష్‌ మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దారా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న గిద్దలూరు శ్రీనివాసులు వస్త్ర భారతి క్లాత్‌ మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు జ్ఞానేష్‌ వేలూరు విట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. 

చిన్న కుమారుడు నితీశ్‌ (21) చైన్నె ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం బీటెక్‌ చదువుతున్నాడు. నితీష్‌ సోమవారం తన మిత్రులతో కలిసి అరుణాచలానికి వెళ్లి తిరిగి వస్తుండగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలో వీరు ప్రయాణిస్నుత్న కారు–ఎదురుగవా వస్తున్న లారీ ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో నితీశ్‌తోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషాదకర సంఘటన గురించి తెలుసుకున్న నితీశ్‌ తల్లిదండ్రులు సుజాత, శ్రీనివాసులు ఆదివారం రాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. సోమవారం తిరువళ్లూరులో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం నితీష్‌ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి చేర్చారు. ధారా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వేంపల్లి అరుణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరికొందరు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు.

 

నితీష్‌ కుటుంబంలో విషాదం1
1/1

నితీష్‌ కుటుంబంలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement