రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Oct 7 2025 4:07 AM | Updated on Oct 7 2025 4:07 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం చారగొండకు చెందిన కొట్ర శివ(29) ద్విచక్ర వాహనంపై మరో మహిళతో కలిసి దేవరకొండ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కొండభీమనపల్లి వద్దకు రాగానే దేవరకొండ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శివ, మహిళ కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి వివరాలు సేకరించారు. మృతదేహాలను దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement