
ఎంజీయూలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
నల్లగొండ టూటౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంజీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు 20 అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ యూనివర్సిటీ సూచన ప్రకారం విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఈ నెల 15 లోగా usbmguict 2025@gmail.com మెయిల్ కు పంపాలని సూచించారు.
వాగులో పడి మహిళ మృతి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): వాగులో పడి మహిళ మృతిచెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన పచ్చిపాల నాగమ్మ(45) మూడ్రోజుల క్రితం మోతె మండలం సర్వారంలో బంధువుల దశదినకర్మకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ.. ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామ పరిధిలోని వాగులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగి కాలు జారి వాగులో పడింది. గురువారం ఉదయం స్థానికులు వాగు వద్దకు వెళ్లగా మహిళ మృతదేహం నీటిపై తేలుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.