ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్‌ బజార్‌’ | - | Sakshi
Sakshi News home page

ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్‌ బజార్‌’

Aug 8 2025 6:56 AM | Updated on Aug 8 2025 6:56 AM

ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్‌ బజార్‌’

ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్‌ బజార్‌’

మిర్యాలగూడ: ఇసుక అక్రమ దందాను అరికట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుక అందించడానికే సాండ్‌ బజార్‌ను ఏర్పాటు చేసినట్లు అన్నారు. రాష్ట్ర మైనింగ్‌ శాఖ ఎండీ భవేష్‌ మిశ్రా అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో రాష్ట్ర మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్‌ బజార్‌ను నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాండ్‌ బజార్‌లో టన్ను ఇసుక రూ.1250కు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు సాండ్‌ బజార్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తక్కువ ధరకు ఇసుకతో పాటు స్థానిక సిమెంట్‌ పరిశ్రమ యాజమాన్యాలతో మాట్లాడి సిమెంట్‌ బస్తాకు రూ.50 చొప్పున తగ్గింపు ధరలో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటుకలు కూడా మార్కెట్‌ ధర కంటే ఒక రూపాయి తక్కువకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్‌ శాఖ ఏడీ జాకోబ్‌, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర మైనింగ్‌ శాఖ ఎండీ భవేష్‌ మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement