
న్యాక్ ఏ గ్రేడ్ కోసం ప్రణాళిక రూపొందించాలి
● మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్లో ఏ గ్రేడ్ సాధించేలా అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం యూనివర్సిటీలో వివిధ విభాగాల ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాక్కు అందించే సెల్ఫ్ స్టడీ నివేదికలోని అంశాలపై అధ్యాపకులు అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రతి విభాగం వారు విధిగా వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధనా కాలంలో కనీసం 2 పరిశోధనా పత్రాలు పరిశీలించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విభాగాల వారీగా ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేస్తామన్నారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలన్నారు.ఽ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రేమ్సాగర్, డాక్టర్ కె. అరుణప్రియ, సీహెచ్. సుధారాణి, శ్రీదేవి, రేఖ, అంజిరెడ్డి, ఆకుల రవి, హరీష్కుమార్, డాక్టర్ వై. ప్రశాంతి, మిర్యాల రమేష్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నియామకం
నల్లగొండ టూటౌన్: ఎంజీయూలో వివిధ విభాగాల్లో సిలబస్ కూర్పు, పాఠ్యాంశాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ విధానం, వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనకు గాను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను నియమిస్తూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బిజినెస్ మేనేజిమెంట్ విభాగం చైర్మన్గా మారం వెంకటరమణారెడ్డి, సోషల్ వర్క్ చైర్మన్గా డాక్టర్ శ్రీధర్(ఓయూ), హిస్టరీ అండ్ టూరిజం విభాగం చైర్మన్గా కె. విజయ్బాబు(కాకతీయ యూనివర్సిటీ), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా ఏవీఎన్.రెడ్డి(అంబేద్కర్ యూనివర్సిటీ)ని నియమించారు.

న్యాక్ ఏ గ్రేడ్ కోసం ప్రణాళిక రూపొందించాలి