బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు | - | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు

Aug 8 2025 6:56 AM | Updated on Aug 8 2025 6:56 AM

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లే

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లే

రామన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్‌రెడ్డి 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని, మేధావులను, ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఆర్డినెన్స్‌ను రూపొందించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై నమ్మకం లేకనే ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 42శాతం నామినేటెడ్‌ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కంభంపాటి శ్రీనివాస్‌, నాయకులు బద్దుల రమేష్‌, సాల్వేరు అశోక్‌, వేమవరపు సుధీర్‌బాబు తదితరులు ఉన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement