
మనువాద సిద్ధాంతం వ్యాప్తి చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
సూర్యాపేట: బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తిచేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణిచివేస్తున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ థరావత్ వీరన్ననాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నివర్గాలను సమానంగా ఆదరిస్తుందని అన్నారు. ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని సీఎం రేవంత్రెడ్డి సెలవు దినంగా ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కృషి చేస్తుందని, కావున కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవా లని, అందుకోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్యా కోటియానాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రాం ఇన్చార్జి లింగంనాయక్, బాబునాయక్, నాగేశ్వర్నాయక్, శ్రీను, మల్లికార్జున్, శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్
రాంచందర్నాయక్