
మనువాద సిద్ధాంతం వ్యాప్తి
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మనువాద సిద్ధాంతం వ్యాప్తి చేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్ అన్నారు.
- 8లో
ఈ ఫొటోలోని రైతు ఆత్మకూర్ (ఎం) మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎమ్మ మధు. ఈయనకు 2.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత యాసంగిలో రూ.14,025 అతని ఖాతాలో జమ అయ్యాయి. వానాకాలం రైతు భరోసా కేవలం రూ.1,500 మాత్రమే జమ అయ్యింది. దీంతో సదరు రైతు ఏఈఓ క్రాంతి కుమార్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా నా పరిధిలో ఏమి లేదని అధికారి చెప్పారు. మధుతో పాటు ఆయన తమ్ముడు ప్రశాంత్కు కూడా రెండు ఎకరాల 13 గంటల భూమికి రూ.1,500 మాత్రమే పడ్డాయి. వారి వ్యవసాయ భూముల్లో ప్రస్తుతం పత్తి పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.