
రైతు సంక్షేమంలో రాజీలేదు
భువనగిరిటౌన్ : రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా రైతు భరోసా అందిస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో చేపట్టిన సంబరాల్లో భాగంగా మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, పోత్నక్ ప్రమోద్ కుమార్, టీపీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వరు, కూర వెంకటేష్, బర్రె జహంగీర్, కృష్ణ రెడ్డి, నర్సింహ, సలాద్దీన్, ఈరపాక నర్సింహ, బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గ్గొన్నారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి