
మహోన్నత వ్యక్తి.. డాక్టర్ అంబేద్కర్
అడ్డగూడూరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేసిన మహాన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అన్నారు. అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలో అభిల పక్ష యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం వారు ఆవిష్కరించి మాట్లాడా రు. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు. భవిష్యత్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పపల్లి మహేంద్రనాథ్, కుమారస్వామి, అఖిల పక్ష యూత్ కమిటీ సభ్యులు బాకి సుధీర్, మందుల కిరణ్, తలపాక మహేష్ పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ