
పథకాలు పక్కాగా అమలు కావాలి
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీసీఈఓ శోభా రాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, డీపీఓ సునంద, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ఉన్నారు.
భూ అర్జీలకు త్వరగా పరిష్కారం చూపండి
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కంచాలని కలెక్టర్ హనుమంతరావు తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. అన్ని మాడ్యుల్స్లో దాఖలైన భూభారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచొద్దన్నారు. రెవెన్యూ సిబ్బంది పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు