సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక

Jun 26 2025 6:03 AM | Updated on Jun 26 2025 6:03 AM

సంప్ర

సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీస్వామి వారి ప్రధానాలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను వేద మంత్రోత్సరణలతో జరిపించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు.

విద్యార్థులను భాగస్వామ్యం చేద్దాం

భువనగిరి : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేద్దామని డీఈఓ సత్యనారాయణ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు జరిగే క్విజ్‌ పోటీల కోసం నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ కమిటీ తయారు చేసిన పోస్టర్‌ను బుధవారం డీఈఓ భువనగిరిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఐదు దశలలో జరిగే పోటీలకు సంబందించి ఫలితాలు ఆగస్టు 30న వెలువడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖఏడీ ప్రశాంత్‌రెడ్డి, ఎన్‌జీసీ స్టేట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ రాజశేఖర్‌, సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులు

ప్రబలకుండా చూడాలి

భువనగిరి : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్‌ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో ప్రకృతి వైపరిత్యాలు, ఆరోగ్య సమస్యలు, సీజనల్‌ వ్యాధులపై పారా మెడికల్‌ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సాయిశోభ, డాక్టర్‌ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిల్పిని, యశోద, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడా పోటీల్లో రాణించాలి

భువనగిరి : విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కె.ధనుంజనేయులు అన్నారు. బుధవారం భువనగిరి ఎస్సీ గురుకులంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి వెళ్లిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్‌, శ్రీను, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ దరశథ, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా  నిత్యకల్యాణ వేడుక1
1/3

సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక

సంప్రదాయబద్ధంగా  నిత్యకల్యాణ వేడుక2
2/3

సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక

సంప్రదాయబద్ధంగా  నిత్యకల్యాణ వేడుక3
3/3

సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement