ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 24 2026 6:48 AM | Updated on Mar 24 2026 6:48 AM

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నూజివీడు: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ మహమద్‌ ఫారూఖ్‌ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్‌ కాలనీలోని పాఠశాల తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు ఏప్రిల్‌ నెల నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి తరగతికి 40 సీట్లు ఉంటాయని చెప్పారు. ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2 నుంచి 5వ తరగతి వరకు చేరాలనుకునే వారు దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement