నూజివీడు: నూజివీడులోని సారథి ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏలూరు జిల్లా నూజివీడులో మూడు రోజుల పాటు నిర్వహించిన 15వ అండర్–15, 2వ అండర్–13, 7వ అండర్–10 అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియషన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఏపీ ఆర్చరీ అసోసియేషన్, చెరకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. కాంపౌండ్ విభాగంలో పోటీల్లో 100మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం రికర్వ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 26నుంచి ఏప్రిల్ 7 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటీలో నిర్వహించే జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో ఏపీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ముగింపు కార్యక్రమంలో కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ చెరుకూరి దుర్గాప్రసాద్, సారధి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సూరానేని శ్రీధర్, చెరుకూరి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.


