పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు
ఉండి శివారు ఉప్పుగుంట పంట కాలువలోకి ఓ ఆక్వా రైతు ఆక్వా వ్యర్థాలను విడిచిపెడుతున్నాడు. దీంతో కాలువ కలుషితమవుతోంది. 8లో u
బంగారం ధర భారీగా పెరగడంతో కొనుగోళ్లు 50 శాతం మేర తగ్గాయి. గతేడాది నుంచి బంగారం వేగంగా పెరుగుతూ వస్తుంది. గత డిసెంబర్ నుంచి మరింత పెరుగుదల కనిపిస్తోంది. ఈ ప్రభావం కొనుగోళ్లపై పడింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వచ్చేనెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లు ఉన్నవారు మాత్రమే తప్పని పరిస్థితుల్లో బంగారం కొంటున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారాన్ని ఆభరణాలు కంటే క్వాయిన్స్, బిస్కెట్ రూపంలో కొనేవారు పెరుగుతున్నారు.
– కోట్ల నాగేశ్వరావు (నాని),
భీమవరం బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడు
నేను 50 ఏళ్లుగా బులియన్ వ్యాపారిగా ఉన్నాను. ఎన్నడూ లేనంతగా బంగారం ధరల్లో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. రెండేళ్లుగా ధరలు పెరుగుతున్నా.. మూడు నెలల నుంచి బంగారం ధర గంట గంటకూ మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా విధి విధానాలు, ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ బంగారం మార్కెట్పై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్ వద్దు బంగారమే కావాలని పలు దేశాలు బంగారం నిల్వ చేసుకునే పరిస్థితి రావడంతో డిమాండ్ పెరిగింది. బంగారం వెంటే వెండి ధరలు పెరగడం ఆశ్చర్యంగా ఉంది.
– కార్మూరి సత్యనారాయణమూర్తి, బులియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు


