
సివిల్స్లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక
నూజివీడు : రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఒంగోలు క్యాంపస్లో 2016–22 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని సాయి శివాని యూపీఎస్సీ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించింది. గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి దేశంలో అత్యున్నత స్థాయిలో ర్యాంకు సాధించడం ఆమె కృషికి, పట్టుదలకు, అభ్యాసన పట్ల చూపిన నిబద్ధతకు నిదర్శనం. సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో ట్రిపుల్ ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్చార్జి చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయ్కుమార్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఆమెకు అభినందనలు తెలిపారు.
నేటి నుంచి నాటిక పోటీలు
భీమవరం: భీమవరం పట్టణంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి నాటిక పోటీలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నాటిక పోటీల కోసం గన్నాబత్తుల క్రీడా మైదానంలో ప్రత్యేంగా వేదిక ఏర్పాటుచేశారు. ఈ నాటిక పోటీల ప్రారంభం సందర్భంగా ప్రముఖ సినీనటుడు రావు రమేష్ను ఆత్మీయ చైతన్య పురస్కారంతో సత్కరించనున్నారు. పోటీలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభిస్తారని పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ చెప్పారు. సినీ నటులు, రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాలకు పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం అందించనున్నారు.
మాతా శిశు మరణాలపై నిర్లక్ష్యం తగదు
భీమవరం (ప్రకాశంచౌక్): తల్లి మరణిస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతతో చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో సీ్త్ర పాత్ర కీలకమైందని, తల్లి చనిపోతే పిల్లలు, కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడతారని, ఈ విషయాన్ని ప్రసూతి వైద్యులు గుర్తించుకోవాలన్నారు. 2024 – 25 సంవత్సరంలో జిల్లాలో 8 మంది తల్లులు, 88 శిశు మరణాలు సంభవించాయన్నారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రైవేట్ నర్సింగ్ హోంలు వైద్యం అందించడంలో మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జి.గీతా బాయి, కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ బి.సుజాత రాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.సూర్యనారాయణ, డీఏఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి మార్టేరు –పెనుగొండ రహదారి మూసివేత
పెనుమంట్ర: పెనుగొండ –మార్టేరు ప్రధాన రహదారిలో మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి జూన్ 10 తేదీ వరకు 45 రోజులపాటు రోడ్డును మూసివేస్తున్నట్లు ఆర్ అండ్ బీ ఏఈ ప్రసాద్ మంగళవారం తెలిపారు. పెనుమంట్ర మండలం నెగ్గెపూడి వద్ద బ్రాంచ్ కాలువకు వంతెన నిర్మాణం పెనుగొండలో పెద్ద వంతెనకు మరమ్మతుల చేపట్టిన నేపథ్యంలో ఈ రూట్ లో వాహనాలు రాకపోకలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, రాజమండ్రి, రావులపాలెం వెళ్లే వాహనాలను మార్టేరు నుంచి ఆచంట సిద్ధాంతం మీదుగా.. తణుకు, పెరవలి, నిడదవోలు వైపు వెళ్లే వాహనాలను ఆలమూరు కంతేరు మీదుగా మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సివిల్స్లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక

సివిల్స్లో ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థినికి 11వ ర్యాంక