హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు.


