భూమి రాదేమోననే బెంగతో వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

భూమి రాదేమోననే బెంగతో వృద్ధురాలి మృతి

Apr 30 2026 8:13 AM | Updated on Apr 30 2026 8:13 AM

గీసుకొండ: తన అన్న, వదిన నుంచి రావాల్సిన భూమి రాదేమోననే బెంగతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆరెపల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరెపల్లికి చెందిన కోట్ర రమాదేవి (70) తన అన్న, వదిన కంది చంద్రయ్య, సరోజన వద్ద గతంలో కొంత భూమి కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆమె భర్త సాంబరెడ్డి ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. కొనుగోలు చేసిన భూమిని అన్నవదిన ఆమె పేర పట్టా చేయకుండా మొండికేస్తూ వస్తున్నారు. రమాదేవి ఇద్దరు కుమారులు హనుమకొండలో నివాసం ఉంటుండగా, రమాదేవి ఆరెపల్లిలోని తన ఇంటిలో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అన్న, వదిన నుంచి కొనుగోలు చేసిన భూమి వస్తుందో లేదో అనే బెంగతో అనారోగ్యానికి గురై మంగళవారం ఇంటి వద్ద మృతి చెందింది. బుధవారం మృతురాలి కుమారుడు శ్యాంసుందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు.

డీజిల్‌ లోకోషెడ్‌ అభివృద్ధికి సమష్టి కృషి

రైల్వే సీనియర్‌ డీఎంఈ వెంకటకుమార్‌

ఘనంగా డీజిల్‌ షెడ్‌ 53వ వసంతాల వేడుకలు

కాజీపేట రూరల్‌: కాజీపేట డీజిల్‌ లోకో షెడ్‌ సమష్టి కృషితోనే దేశంలో మంచి గుర్తింపు లభించిందని డీజిల్‌ షెడ్‌ సీనియర్‌ డీఎంఈ ఎన్‌.వి.వెంకటకుమార్‌ అన్నారు. మంగళవారం రాత్రి డీజిల్‌ లోకో షెడ్‌ 53వ వసంతాల వేడుకలు కనులపండువగా జరిగాయి. రైల్వే సీనియర్‌ డీఎంఈ వెంకటకుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ అధికారుల సహకారంతో డీజిల్‌ షెడ్‌ రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు, రైల్వే కార్మికులు విధుల నిర్వహణలో మంచి ఫలితాలతో 53వ వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్‌ డీఈఈ కేవీ.హరికృష్ణ కేక్‌ కట్‌ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంఈ అనికేత్‌ ఖడ్గే, ఎడీఎంఈలు శ్రీనివాస్‌రావు, నాగరాజశేఖర్‌, ఏడీఈ సతీశ్‌కుమార్‌, ఏసీఎంటీ మల్లికార్జునరావు, ఎ.ఎం.ఎం రాజేశ్‌, కాజీపేట స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ జోనల్‌ ప్రెసిడెంట్‌ కాల్వ శ్రీనివాస్‌, యూనియన్‌ డీజిల్‌ బ్రాంచ్‌ నాయకులు పాక వేదప్రకాశ్‌, ఎస్‌కే జానీమియా, ట్రెజరర్‌ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, రవికిరణ్‌, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ డీజిల్‌ బ్రాంచ్‌ నాయకులు సీడబ్ల్యూసీ మెంబర్‌ ఎ.మధుసూదన్‌రావు, ఎస్‌.సమ్మయ్య, ఇ.రాములు, ఆర్‌.వెంకటేశ్వర్లు, టి.ప్రవీణ్‌, ఎ.పదీప్‌కుమార్‌, రైల్వే ఓబీసీ సంఘం నుంచి ఎ.సంతోశ్‌కుమార్‌, శ్యాం, ఆంజనేయులు, రైల్వే ఎస్సీ ఎస్టీ సంఘం నుంచి పాండు, నాయక్‌, దేవేందర్‌, రైల్వే కార్మికులు, కార్మిక కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement